టీడీపీపై వర్మ రివర్స్ అటాక్

తెలుగుదేశం పార్టీ నేతలతో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంటున్నారు. తాను తీస్తున్న లక్ష్మీ’స్ ఎన్టీఆర్ సినిమాలో ‘వెన్నుపోటు’ పాట విడుదల చేసి చంద్రబాబు [more]

Update: 2018-12-26 11:48 GMT

తెలుగుదేశం పార్టీ నేతలతో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంటున్నారు. తాను తీస్తున్న లక్ష్మీ’స్ ఎన్టీఆర్ సినిమాలో ‘వెన్నుపోటు’ పాట విడుదల చేసి చంద్రబాబు నాయుడును ఆయన టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాంగోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్ లోని వివి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కర్నూలులో టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి… రాంగోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, దీనికి కౌంటర్ గా రాంగోపాల్ వర్మ… ఎస్వీ మోహన్ రెడ్డికి లాయర్ నోటీసులు పంపించారు. వర్మను ఇబ్బంది పెట్టడానికే ఫిర్యాదు చేశారని ఆయన తరపు న్యాయవాది నోటీసులు పంపారు. ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని పేర్కొన్నారు.

Tags:    

Similar News