మోడీపై రాహుల్ ఫైర్

Update: 2018-05-19 11:41 GMT

కర్ణాటకలో బీజేపీ, ఆరెఎస్సెస్ లకు సరైన గుణపాఠం లభించిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. శనివారం యడ్యూరప్ప రాజీనామా చేసిన అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని దేశం కంటే, సుప్రీంకోర్టు కంటే కూడా తానే గొప్ప అనుకుంటున్నాడని పేర్కొన్నారు. జాతీయ గీతం పాడకముందే స్పీకర్, బీజేపీ నేతలు సభ నుంచి వెళ్లిపోయారన్నారు. బీజేపీ, ఆరెస్సెఎస్ ల ధోరణికి ఇదే నిదర్శనమని, ప్రతీ వ్యవస్థను అగౌరవపరిచేలా బీజేపీ వ్యవహరిస్తుందన్నారు. బీజేపీ ప్రజాతీర్పును కూడా గౌరవించదని మణిపూర్, గోవాల్లో చూశామన్నారు. కర్ణాటక పరిణామాలను చూసైనా బీజేపీ, ఆరెస్సెస్ బుద్ధి తెచ్చుకోవాలన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ నుంచి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని, అవినీతి గురించి మాట్లాడే ప్రధాని ఇలా ఎలా చేస్తారని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని, అధికారం కోసం హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని ఘాటుగా విమర్శించారు.

Similar News