నెల రోజులు ఆగి ఆ తర్వాత

మూడు రాజధానుల అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ నెల రోజుల పాటు వాయిదా వేయాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు  డిమాండ్ చేశారు. మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర [more]

Update: 2020-08-02 02:18 GMT

మూడు రాజధానుల అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ నెల రోజుల పాటు వాయిదా వేయాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా రిఫరెండం నిర్వహించిన తర్వాతనే నిర్ణయాన్ని అమలు పర్చాలనిి ఆయన కోరారు. రిఫరెండం లో ఫలితాలు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే అమరావతి రైతులు తమ ఆందోళనలను విరమించుకుంటారని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. వ్యతిరేకంగా వస్తే అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని ఆయన కోరారు. హైకోర్టును కూడా కర్నూలుకు తరలించడం సాధ్యం కాదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

Tags:    

Similar News