నేను పార్టీ లైన్ ను దాటలేదు

పార్టీ లైన్ ను తాను ఎన్నడూ దాటలేదని నర్సాపురం పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణంరాజు అన్నారు. ఇంగ్లీష్ వివాదాన్ని తాను పార్లమెంటులో ప్రస్తావించనే లేదన్నారు. తాను నియోజకవర్గ పనుల [more]

Update: 2019-11-22 14:11 GMT

పార్టీ లైన్ ను తాను ఎన్నడూ దాటలేదని నర్సాపురం పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణంరాజు అన్నారు. ఇంగ్లీష్ వివాదాన్ని తాను పార్లమెంటులో ప్రస్తావించనే లేదన్నారు. తాను నియోజకవర్గ పనుల కోసమే కేంద్రమంత్రులను కలిశానన్నారు. ప్రధాని నరేంద్రమోడీ తనకు వ్యక్తిగతంగా తెలుసునని, ఆయన తనకు ఎదురైనప్పుడు సహజంగానే పలుకరించానని చెప్పారు. జగన్ తో భేటీ తర్వాత రఘురామకృష‌్ణంరాజు మీడియాతో మాట్లాడారు. వైసీపీ నుంచి బీజేపీతో టచ్ లో ఎవరూ లేరన్నారు. ఎవరు టచ్ లో ఉన్నారో సుజనా చౌదరి చెప్పాలన్నారు. సుజనా అలా ఎందుకు అన్నారో తనకు తెలియదన్నారు. తాను పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడిన దానిపై జగన్ కు వివరణ ఇచ్చానన్నారు.

Tags:    

Similar News