అసమ్మతి ముదిరితే తట్టుకోలేవు జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. సర్పంచ్ అధికారాలపై కోత విధించడంపై ఆయన [more]

Update: 2021-06-27 05:51 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. సర్పంచ్ అధికారాలపై కోత విధించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి చేటు అని అన్నారు. సర్పంచ్ లకు చెక్ పవర్ పై స్పష్టత లేకపోవడంతో బ్యాంకుల నుంచి నిధులు కూడా తీసుకోలేకపోతున్నారని రఘురామ కృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేక అభివృద్ధి పనులు నిలిచపోయాయని రఘురామ కృష్ణరాజు లేఖలో పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో రగలిపోతున్నారని, ఏదో ఒక రోజు అది బయటపడుతుందని రఘురామ కృష్ణరాజు తన లేఖలో పేర్కొన్నారు. రాజ్యంగం ప్రకారం సర్పంచ్ లకు బాధ్యతలను అప్పగించాలని ఆయన కోరారు.

Tags:    

Similar News