52 రోజుల తర్వాత మంత్రివర్గం ఏర్పాటు

పుదుచ్చేరి మంత్రివర్గం ఈరోజు ప్రమాణస్వీకారం చేయనుంది. ఇప్పటివరకూ ముఖ్యమంత్రి గా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి ఉన్నారు. వివిధ కారణాల దృష్ట్యా ఆయన మంత్రివర్గాన్ని విస్తరించలేదు. పుదుచ్చేరిలో [more]

Update: 2021-06-27 03:47 GMT

పుదుచ్చేరి మంత్రివర్గం ఈరోజు ప్రమాణస్వీకారం చేయనుంది. ఇప్పటివరకూ ముఖ్యమంత్రి గా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి ఉన్నారు. వివిధ కారణాల దృష్ట్యా ఆయన మంత్రివర్గాన్ని విస్తరించలేదు. పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కలసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. మంత్రివర్గ కూర్పుపై భిన్నాభిప్రాయాలు తలెత్తడంతో ఇంతవరకూ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. ఎట్టకేలకు ఈరోజు పుదుచ్చేరి మంత్రివర్గం ప్రమాణస్వీకారం జరగనుంది.

Tags:    

Similar News