బ్రేకింగ్ : ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ కుటంబం నుంచి వారసురాలిగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఆమెను ఏఐసీసీ ప్రధాన [more]

Update: 2019-01-23 07:42 GMT

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ కుటంబం నుంచి వారసురాలిగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఆమెను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆమెకు కీలకమైన ఉత్తరప్రదేశ్ ఈస్ట్ బాధ్యతలను అప్పగించింది. ప్రియాంక గాంధీ.. తన తల్లి, సోదరుడికి పలు సందర్భాల్లో సహకరించినా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి మాత్రం రాలేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమెను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. నాయినమ్మ ఇందిరా గాంధీ పోలికలు కలిగి ఉన్న ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలా పనిచేస్తారో చూడాలి. ఫిబ్రవరిలో ఆమె బాధ్యతలు తీసుకోనున్నారు.

Tags:    

Similar News