బ్రేకింగ్ : భారత్ లో తగ్గుతున్న కరోనా.. కొంత ఉపశమనమే

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుతుంది. తాజాగా భారత్ లో 50,129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 578 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

Update: 2020-10-25 04:45 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుతుంది. తాజాగా భారత్ లో 50,129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 578 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78,64,811 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,18,534 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 6,68,154 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 70,78,123 మంది డిశ్చార్జ్ అయ్యారు. . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News