బ్రేకింగ్ : ప్రణయ్ ను హత్య చేసింది వీడే

Update: 2018-09-18 07:27 GMT

మిర్యాలగూడలో ప్రణయ్ ను హత్య చేసింది బీహార్ కు చెందిన శర్మగా పోలీసులు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం మిర్యాల గూడలో ప్రణయ్ ను ఒక ప్రయివేటు ఆసుపత్రి వద్ద నరికి చంపిన సంగతి తెలిసిందే. తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కారణంతో బిల్డర్ మారుతీరావు దాదాపు కోటి రూపాయల సుపారీ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో మారుతీరావు ఇప్పటికే 18 లక్షలు ఇచ్చారు. అయితే ఈ హత్య చేసింది బీహార్ కు చెందిన శర్మగా గుర్తించిన పోలీసులు అతడిని అక్కడే అరెస్ట్ చేశారు. ఈరోజు సాయంత్రానికి నిందితుడు శర్మను నల్లగొండకు తీసుకురానున్నారు. ఇప్పటికే నిందితులుగా భావిస్తున్న అమృత తండ్రి మారుతీరావు, బాబాయ్ శ్రవణ్, కాంగ్రెస్ నేత కరీంలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Similar News