అసద్ పై కేసు నమోదు

ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పైన పోలీసులు కేసు నమోదు చేశారు .హైదరాబాదులోని మొఘల్ పుర పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్సార్సీ పై మీటింగ్ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ [more]

Update: 2020-03-13 08:24 GMT

ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పైన పోలీసులు కేసు నమోదు చేశారు .హైదరాబాదులోని మొఘల్ పుర పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్సార్సీ పై మీటింగ్ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు అయింది. హైదరాబాద్ కు చెందిన ఒక న్యాయవాది అసదుద్దీన్ ఓవైసీ తో పాటు కపిల్ మిశ్రా పై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న తర్వాత కేసు నమోదు చేయాలంటూ మొఘల్ పుర పోలీసులను కోర్టు ఆదేశించింది. కర్ణాటకలో ఎన్సార్సీకి వ్యతిరేకంగా అసదుద్దీన్ ఓవైసీ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భారతదేశం తో పాటుగా కాశ్మీర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ సందర్భంలోనే అసదుద్దీన్ ఒవైసీ పై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News