బ్రేకింగ్ : టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకున్న పోలీసులు

తెలుగుదేశం పార్టీ నిజనిర్థారణ కమిటీని పోలీసులు అడ్డుకున్నారు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ నేతలు భూ ఆక్రమణకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి జవహర్ నేతృత్వంలో [more]

Update: 2020-05-26 06:37 GMT

తెలుగుదేశం పార్టీ నిజనిర్థారణ కమిటీని పోలీసులు అడ్డుకున్నారు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ నేతలు భూ ఆక్రమణకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి జవహర్ నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీ ఏర్పడింది. లిడ్ క్యాప్ భూములను వైసీపీ నేతలు ఆక్రమించారని పల్నాడు ప్రాంతానికి నిజనిర్ధారణ కమిటీ బయలుదేరి వెళ్లింది. మాచర్ల ప్రాంతానికి వెళ్లిన టీడీపీ నేతలను పర్యటనకు అనుమతి లేదని అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు అక్కడే కొద్దిసేపు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News