వివరాలొచ్చాయి… చర్యలే తరువాయి

తనపై సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల ఫిర్యాదుపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ధర్యాప్తు ముమ్మరం చేశారు. యూట్యూబ్, ఫేస్ బుక్ [more]

Update: 2019-01-18 07:17 GMT

తనపై సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల ఫిర్యాదుపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ధర్యాప్తు ముమ్మరం చేశారు. యూట్యూబ్, ఫేస్ బుక్ లలో షర్మిలపై అసభ్యకరంగా కామెంట్స్ పెట్టిన వారిని పోలీసులు గురించి వివరాలు సేకరించారు. వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక, తప్పుడు ప్రచారాన్ని సృష్టిస్తూ పోస్టులు పెట్టిన వారి ఐసీ అడ్రస్ లు, వివరాలు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే పోలీసులు యూట్యూబ్, ఫేస్ బుక్ కి లేఖలు రాశారు. త్వరలోనే ఈ వివరాలు పోలీసులకు అందనున్నాయి. అయితే, పోలీసుల విచారణ గురించి తెలుసుకున్న కేటుగాళ్లు షర్మిలను కించపరుస్తూ పెట్టిన పోస్టులను తొలగించేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పోస్టులు డిలీట్ చేసినా తప్పించుకోలేరని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News