ఢిల్లీలో నేడు పవన్ కల్యాణ‌్?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు. నాదెండ్ల మనోహర్ తో కలసి ఆయన నడ్డాను [more]

Update: 2020-11-24 02:17 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు. నాదెండ్ల మనోహర్ తో కలసి ఆయన నడ్డాను కలిసి వివిధ అంశాలపై చర్చించనున్నారు. బీజేపీ, జనసేన ల మధ్య సమన్వయం, పోలవరం ప్రాజెక్టు, హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలు తదితర అంశాలపై పవన్ కల్యాణ్ చర్చించనున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లోనూ ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేయనున్నారన్న దానిపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది. అమరావతి రాజధాని అంశంపై కూడా బీజేపీ స్టాండ్ ను తెలుసుకోనున్నారు. చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది

Tags:    

Similar News