ప్రలోభాలకు గురైతే అంతే?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. జోహారపురంలో హంద్రీనీవా బ్రిడ్జిని పవన్ కల్యాణ‌ పరిశీలించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ బ్రిడ్జి [more]

Update: 2020-02-13 06:23 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. జోహారపురంలో హంద్రీనీవా బ్రిడ్జిని పవన్ కల్యాణ‌ పరిశీలించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించింది. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జికి నిధులను నిలిపేశారని స్థానికులు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. బాధ్యత గల నాయకులను ఎన్నుకుంటే ఈ సమస్యలుండవని ఈ సందర్భంగా పవన్ కల్యాణ‌్ అన్నారు. ఎన్నుకునే ముందే ప్రజలు ఆలోచించాలని కోరారు. ప్రలోభాలకు గురై ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే ఇదేరకమైన సమస్యలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా పవన్ కల్యాణ్ మరికొద్దిసేపట్లో ఎమ్మిగనూరులోని చేనేత కార్మికులను పరామర్శిస్తారు.

Tags:    

Similar News