ప్రభుత్వానిదే బాధ్యత…పవన్ డిమాండ్ ఇదే

ఎల్జీ పాలిమర్స్ ను అక్కడి నుంచి తరలించాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అక్కడి ప్రజలు తనకు లేఖ రాశారన్నారు. విషవాయువు ప్రభావం నుంచి [more]

Update: 2020-05-10 13:12 GMT

ఎల్జీ పాలిమర్స్ ను అక్కడి నుంచి తరలించాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అక్కడి ప్రజలు తనకు లేఖ రాశారన్నారు. విషవాయువు ప్రభావం నుంచి ఇంకా ప్రజలు తేరుకోలేదన్నారు. వారికి భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయోనన్న ఆందోళన ఉందన్నారు. అక్కడి నుంచి ఎల్జీ పాలిమర్స్ ను తరలించాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కంపెనీ తరలింపు బాధ్యత ప్రభుత్వానిదేనని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రభుత్వం పరిశ్రమకు అనుకూలంగా ఉందన్న అనుమానాలు అక్కడి ప్రజలు వ్యక్తం చేస్తున్నారన్నారు.

Tags:    

Similar News