హైదరాబాద్ కు తాళం ఇప్పట్లో తీయరట

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 47 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1414కు చేరుకుంది. [more]

Update: 2020-05-15 02:20 GMT

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 47 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1414కు చేరుకుంది. నిన్న నమోదయిన 47 కేసుల్లో 40 కేసులు గ్రేటర్ హైదరాబాద్ లోనే ఉండటం గమనార్హం. ఐదు కేసులు రంగారెడ్డి జిల్లాలో నమోదయ్యాయి. హైదరాబాద్ లోనే ఎక్కువ కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఈరోజు జరిగే సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లో కోవిడ్ కంట్రోల్ పైనే ఎక్కువగా చర్చించనున్నారు. హైదరాబాద్ లో మాత్రం లాక్ డౌన్ నిబంధనల్లో మినహాయింపులు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. జిల్లాల్లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినా హైదరాబాద్ లో పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

Tags:    

Similar News