బ్రేకింగ్ : నలుగురు ఎమ్మెల్సీలకు నోటీసులు

Update: 2018-12-18 11:36 GMT

టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలకు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఎన్నికల ముందు టీఆర్ఎస్ నుంచి కొండా మురళి, రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా నిన్న టీఆర్ఎస్ మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్సీలకు స్వామిగౌడ్ నోటీసులు జారీ చేశారు.

Similar News