రేపటి నుంచి నామినేషన్లు… జరిగేనా?

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు. రేపటి నుంచి పంచాయతీలకు సంబంధించి నామినేషన్లను స్వీకరించాల్సి [more]

Update: 2021-01-24 06:04 GMT

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు. రేపటి నుంచి పంచాయతీలకు సంబంధించి నామినేషన్లను స్వీకరించాల్సి ఉంది. అయితే అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సహాయ నిరాకరణ చేస్తున్నారు. మరోవైపు రేపు ఏపీ ప్రభుత్వంవేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. సుప్రీంకోర్టులో తీర్పును బట్టి తమ ముందడుగు ఉంటుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అయితే సుప్రీంకోర్టులో తీర్పు ఏ కారణంగానైనా వాయిదా పడితే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉండే అవకాశం లేదంటున్నారు. మొత్తం మీద ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.

Tags:    

Similar News