నిన్నటి నుంచి నిమ్మగడ్డ వారితో తప్ప?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భద్రతను ప్రభుత్వం మరింత పెంచింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు, ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తడంతో నిమ్మగడ్డ రమేష్ [more]

Update: 2020-03-19 08:42 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భద్రతను ప్రభుత్వం మరింత పెంచింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు, ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తడంతో నిమ్మగడ్డ రమేష్ కు ముప్పు ఉందని విపక్షాలు సయితం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ ను కూడా కలిసి రమేష్ కుమార్ కు భద్రత పెంచాలని కోరారు. అయితే ప్రభుత్వం రమేష్ కుమార్ భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆయనకు ఎనిమిది మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేయను్నారు. అంతకు ముందు ఇద్దరు మాత్రమే భద్రతగా ఉండేవారు. రమేష్ కుమార్ ఇంటివద్ద కూడా భద్రత పెంచారు. నిన్న హైదరాబాద్ వచ్చిన రమేష్ కుమార్ ఎవరినీ కలిసేందుకు ఇష్టపడటం లేదు. కేవలం బందుమిత్రులనే ఆయన కలుస్తున్నారు. హైదరాబాద్ లోని ఆయన ఇంటివద్ద కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News