ఆ లేఖ నిమ్మగడ్డ రాయలేదు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ టీడీపీ కార్యాలయంలో తయారైనదేనని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు, చంద్రబాబు చెప్పినట్లే ఈయన చేశారన్నారు. హోంశాఖకు [more]

Update: 2020-04-25 08:16 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ టీడీపీ కార్యాలయంలో తయారైనదేనని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు, చంద్రబాబు చెప్పినట్లే ఈయన చేశారన్నారు. హోంశాఖకు పంపిన లేఖకు సంబంధించిన ఆధారాలను కంప్యూటర్ నుంచి తొలగించారన్నారు. నిమ్మగడ్డ రమేష‌ కుమార్ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారారని అంబటి రాంబాబు ఆరోపించారు. కంప్యూటర్ లో హార్డ్ డిస్క్ ను, పెన్ డ్రైవ్ లో ఆధారాలను ఎందుకు చెరిపేయాల్సి వచ్చిందని అంబటి రాంబాబు ప్రశ్నించారు. నిమ్మగడ్డ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చంద్రబాబు చెప్పినట్లే నడుచుకున్నారన్నారు. అందుకే పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేయాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే నిమ్మగడ్డ పదవీకాలాన్ని కుదించామన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖ కు రాసని లేఖ మాత్రం టీడీపీ కార్యాలయంలో తయారైందని ఆయన మరోసారి ఆరోపించారు

Tags:    

Similar News