మాలిక్ బ్రదర్స్ తో టచ్ లో… మూడో వ్యక్తి?

దర్భంగా పేలుడు కేసులో ఇద్దరు హైదరాబాద్ లో ఉంటున్న ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా ఉగ్ర కుట్రలకు హైదరాబాద్ నుండి ప్లాన్ జరిగినట్లు [more]

Update: 2021-07-01 03:25 GMT

దర్భంగా పేలుడు కేసులో ఇద్దరు హైదరాబాద్ లో ఉంటున్న ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా ఉగ్ర కుట్రలకు హైదరాబాద్ నుండి ప్లాన్ జరిగినట్లు గుర్తించారు. హైదరబాద్ నాంపల్లి లో ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూన్ 17 న దర్భంగా లో పేలుడు కు హైదరాబాద్ నుండే స్కెచ్ చేసినట్లు గుర్తించారు. సికింద్రాబాద్ నుండి దర్భంగా వెళ్తున్న ట్రైన్ 07007 లో పేలుడు సామాగ్రిని పార్సిల్ లో వీరు అమర్చారు. అయితే మాలిక్ బ్రదర్స్ తో మరో వ్యక్తి టచ్ లో ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News