బ్రేకింగ్ : మోదీ సంచలన నిర్ణయం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి [more]

Update: 2019-01-07 09:37 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. రేపు లోక్ సభలో దీనిని ప్రవేశపెట్టే అవకవాశముంది. ఏడాదికి ఎనిమిది లక్షలు లోపు ఆదాయం, ఐదెకరాల భూమి లోపు ఉన్న అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. ఆర్థికంగా వెనకబడిన బిల్లుపై రాజ్యాంగ సవరణ చేయనున్నారు. వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువ ఉన్న వారే ఈ పరిధిలోకి వస్తారు. యాభై నుంచి 60 శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ కేండ్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News