బ్రేకింగ్ : నేడు ప్రధాని ప్రసంగం.. లాక్ డౌన్ పై?

ప్రధాని నరేంద్ర మోదీ నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రి 8గంటలకు మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. నిన్న ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. లాక్ డౌన్ కొనసాగుతున్న [more]

Update: 2020-05-12 06:52 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రి 8గంటలకు మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. నిన్న ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. లాక్ డౌన్ కొనసాగుతున్న తీరు, సడలింపులు తదితర అంశాలపై ముఖ్యమంత్రులతో చర్చించారు. కొందరు ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ను మరికొంతకాలం పొడిగించాలని కోరారు. కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ప్రధానికి ప్రత్యేకంగా నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈరోజు ప్రధాని మోదీ మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తారా? లేదా? అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే లాక్ డౌన్ ను కొంతకాలం ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Tags:    

Similar News