ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నట్లుంది

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ప్రజలపై కక్ష తీర్చుకునేలా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తనకు అధికారమిచ్చినందుకు ప్రజల రుణం తీర్చుకోవాల్సిన [more]

Update: 2019-08-16 06:52 GMT

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ప్రజలపై కక్ష తీర్చుకునేలా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తనకు అధికారమిచ్చినందుకు ప్రజల రుణం తీర్చుకోవాల్సిన జగన్, తనను ఇన్నాళ్లూ దూరం పెట్టినందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు. అన్నా క్యాంటిన్లు మూసివేసి ప్రజల కడుపులు కొట్టారన్నారు. ఇప్పటికైనా అన్నా క్యాంటిన్లు తెరిచి పేదల కడుపు నింపాలని లోకేష్ జగన్ ను కోరారు.

Tags:    

Similar News