నేడు గురజాలకు లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురజాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హత్యకు గురైన టీడీపీ నేత పురంశెట్టి అంకులు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అంకులు అంతిమ [more]

Update: 2021-01-04 03:12 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురజాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హత్యకు గురైన టీడీపీ నేత పురంశెట్టి అంకులు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అంకులు అంతిమ యాత్రలో లోకేష్ పాల్గొననున్నారు. టీడీపీనేత అంకులును గుర్తుతెలియని వ్యక్తులు నిన్న రాత్రి దాచేపల్లిలో హత్య చేశారు. టీడీపీ నేతలను వరసగా హత్యలు చేయడంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యకు నిరసనగా దాచేపల్లిలో టీడీపీ శ్రేణులు నిరసనకు సిద్ధమవుతున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News