పాలకులే నేరగాళ్లయితే ఏం చేస్తాం?

పాలకులు నేరగాళ్లు అయినప్పుడు ఏం చేయలేమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కాకినాడ మడ అడవులను నరికి వేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం [more]

Update: 2020-05-12 04:46 GMT

పాలకులు నేరగాళ్లు అయినప్పుడు ఏం చేయలేమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కాకినాడ మడ అడవులను నరికి వేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పాలకులు నేరగాళ్లు ఉన్నప్పుడు చట్టాలు సక్రమంగా అమలు కావని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. పర్యావరణాన్ని నాశనం చేస్తూ మత్స్యకారుల పొట్టలను ప్రభుత్వం కొడుతుందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదల కోసం ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే మడ అడవులు నరికి వేయాలా? అని నారా లోకేష్ ప్రశ్నించారు. దీనివల్ల భవిష్యత్తులో కాకినాడకు తుపాను ముప్పు పొంచి ఉంటుందన్నారు.

Tags:    

Similar News