వాటిని రద్దు చేయాల్సిందే.. వేరే మార్గం లేదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని లోకేష్ తన [more]

Update: 2021-05-14 01:08 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని లోకేష్ తన లేఖలో కోరారు. మరో మూడు వారాల్లో ఏపీలో పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కరోనా తీవ్రత దృష్ట్యా టెన్త్ పరీక్షలను రద్దు చేయాలని నారా లోకేష్ జగన్ కు రాసిన లేఖలో కోరారు. తెలంగాణతో సహా మరో 12 రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని నారా లోకేష్ తన లేఖలో గుర్తు చేశారు. కరోనా ఎప్పుడు తగ్గుతుందో తెలియదని, వీటిని వాయిదా వేయకుండా రద్దు చేయాలని నారా లోకేష్ తన లేఖలో కోరారు.

Tags:    

Similar News