పబ్లిసిటీ పీక్… మ్యాటర్ వీక్.. జగన్ పాలనపై లోకేష్ ధ్వజం

జగన్ పాలనపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. నారా లోకేష్ మున్సిపల్ ఎన్నికల మ్యానిఫేస్టోను విడుదల చేశారు. తమను [more]

Update: 2021-02-26 05:52 GMT

జగన్ పాలనపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. నారా లోకేష్ మున్సిపల్ ఎన్నికల మ్యానిఫేస్టోను విడుదల చేశారు. తమను అధికారంలోకి తెస్తే అన్నా క్యాంటిన్లను తిరిగి తెస్తామని చెప్పారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. స్వచ్ఛమైన సాగునీరు అందిస్తామని నారా లోకేష్ చెప్పారు. పట్టణ పేదలందరకి శాశ్వత గృహాలను నిర్మిస్తామని చెప్పారు. పారిశుధ్య కార్మికులకు 21 వేల రూపాయాలకు వేతనాలను పెంచుతామన్నారు. పాత ఆస్తిపన్ను బకాయిని రద్దు చేస్తామని, భవిష్యత్ లో సగం ఆస్తిపన్నును మాత్రమే వసూలు చేస్తామని నారా లోకేష్ చెప్పారు. జగన్ పాలన పబ్లిసిటీ పీక్, మ్యాటర్ వీక్ లా ఉందని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. మొత్తం పది అంశాలతో నారా లోకేష్ టీడీపీ మున్సిపల్ ఎన్నికల మ్యానిఫేస్టోను విడుదల చేశారు.

Tags:    

Similar News