బ్రేకింగ్ : ఆ అభ్యర్థులను ప్రకటించిన లోకేష్

Update: 2018-07-09 10:59 GMT

కర్నూలు ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేస్తారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. నారాలోకేష్ ప్రకటనతో టీజీ వర్గం ఆందోళనలో పడింది. కర్నూలు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. లోకేష్ పర్యటనకు ఇటు టీజీ వెంకటేశ్ వర్గం, అటు ఎస్వీ మోహన్ రెడ్డి వర్గం భారీ ఏర్పాట్లు చేశాయి. ఎస్వీ మోహన్ రెడ్డి, బుట్టా రేణుకలిద్దరూ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరారు. ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి లను వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని లోకేష్ కోరడంతో టీజీ వెంకటేశ్ వర్గం నిరాశలో మునిగిపోయింది. పార్టీ అభ్యర్థులను ఎన్నికలకు ముందు ప్రకటిస్తారని, అయితే తెలుగుదేశం పార్టీ సంప్రదాయాలకు విరుద్ధంగా లోకేష్ ప్రకటించారన్న వాదనలు కర్నూలు జిల్లా పార్టీలో అప్పుడే బయలుదేరాయి.

Similar News