బాబుకు షాకిచ్చిన రాజధాని రైతులు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రాజధాని అమరావతి రైతులు షాకిచ్చారు. చంద్రబాబుపై నమ్మకంతోనే తాము రాజధాని కోసం భూములిచ్చామని తెలిపారు. గ్రాఫిక్స్ తో తమను భ్రమపెట్టారన్నారు. విద్య, వైద్యం [more]

Update: 2019-11-25 07:44 GMT

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రాజధాని అమరావతి రైతులు షాకిచ్చారు. చంద్రబాబుపై నమ్మకంతోనే తాము రాజధాని కోసం భూములిచ్చామని తెలిపారు. గ్రాఫిక్స్ తో తమను భ్రమపెట్టారన్నారు. విద్య, వైద్యం విషయాల్లో రాజధాని రైతులకు హామీ ఇచ్చిన చంద్రబాబు తర్వాత అమలు పర్చలేదన్నారు. నారాయణ, లోకేష్, చంద్రబాబులు కాంట్రాక్టర్ల నుంచి ఎంత వసూలు చేశారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. టీడీపీ అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు తొమ్మిది వేల ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపించారు. భూములిస్తే ఉద్యోగాలిస్తామని చెప్పిన చంద్రబాబు తమను దారుణంగా మోసం చేశారన్నారు. ఈనెల 28వ తేదీన రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో కొందరు రైతులు మీడియా ఎదుట ఈ ఆరోపణలు చేశారు. గ్రాఫిక్స్ తో తమను భ్రమపెట్టారన్నారు. ఇక్కడ చంద్రబాబు పర్యటించే ముందు రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు కన్పిస్తుంది.

Tags:    

Similar News