ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా.. కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం

కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు కేంద్ ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ [more]

Update: 2021-05-14 01:06 GMT

కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు కేంద్ ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ తీవ్రత కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఎమ్మెల్యే కోటా కింద మే 31తో ఆంధ్రప్రదేశ్ లో మూడు స్థానాలు, జూన్ 3 వ తేదీతో తెలంగాణలో ఆరుస్థానాలు ఖాళీ కానున్నాయి. అయితే కోరోనా పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే ఎన్నికలను నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.

Tags:    

Similar News