విజన్ “2020”లో జోలె పట్టిందెందుకు?

29 రాష్ట్రాల్లో చక్రం తిప్పుతానన్న చంద్రబాబును వైఎస్ జగన్ 29 గ్రామాలకే పరిమితం చేశారని మంత్రి కన్నబాబు తెలిపారు. చంద్రబాబు పదే పదే తన మీద కక్షతోనూ, [more]

Update: 2020-01-20 08:51 GMT

29 రాష్ట్రాల్లో చక్రం తిప్పుతానన్న చంద్రబాబును వైఎస్ జగన్ 29 గ్రామాలకే పరిమితం చేశారని మంత్రి కన్నబాబు తెలిపారు. చంద్రబాబు పదే పదే తన మీద కక్షతోనూ, ఒక సామాజిక వర్గంపైన కక్షతోనో రాజధానిని తరలించవద్దని కోరుతున్నారని, జగన్ కు అంత కక్ష ఎందుకుంటుందని కన్నబాబు ప్రశ్నించారు. చంద్రబాబు పదే పదే విజన్ 2020 అంటుంటారని, సరిగ్గా అదే సమయానికి జోలె పట్టుకునే పరిస్థితి వచ్చిందని కన్నబాబు ఎద్దేవా చేశారు. అమరావతిని మారిస్తే చైనా నుంచి ముప్పు ఉంటుందని, విశాఖలో మావోయిస్టుల ప్రభావం ఉంటుందని చంద్రబాబుకు బాకా ఊదే పత్రికలు ప్రచారం చేస్తున్నాయన్నారు. అమరావతికి, దేశ సమగ్రతకు ముడిపెట్టి కథనాలను వండి వారుస్తున్నారన్నారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వం థ్యేయమని కన్నబాబు తెలిపారు. అమరావతి ఆందోళనతో చంద్రబాబు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు.

Tags:    

Similar News