నిందితులను గుర్తించాం.. త్వరలోనే అరెస్ట్ చేస్తాం

తాడేపల్లి యువతి అత్యాచారం కేసులో నిందితులను గుర్తించామని హోంమంత్రి సుచరిత తెలిపారు. ఆధారాలను బట్టి నిందితులు ఎవరో తెలిసిపోయిందన్నారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని సుచరిత వెల్లడించారు. [more]

Update: 2021-06-25 07:36 GMT

తాడేపల్లి యువతి అత్యాచారం కేసులో నిందితులను గుర్తించామని హోంమంత్రి సుచరిత తెలిపారు. ఆధారాలను బట్టి నిందితులు ఎవరో తెలిసిపోయిందన్నారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని సుచరిత వెల్లడించారు. ముందుగానే నిందితుల పేర్లు చెబితే వారు తప్పించుకునే అవకాశముందని, అందుకే పేర్లు గోప్యంగా ఉంచామని సుచరిత తెలిపారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సుచరిత హెచ్చరించారు.

Tags:    

Similar News