బ్రేకింగ్: ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హతం..!

పూల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇవాళ మరోసారి సైన్యం – ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పుల్వామాలో దాడికి సహకరించిన ఉగ్రవాదులు ఓ [more]

Update: 2019-02-18 06:12 GMT

పూల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇవాళ మరోసారి సైన్యం – ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పుల్వామాలో దాడికి సహకరించిన ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కున్నారనే సమాచారంతో సీఆర్పీఎఫ్ జవాన్లు పుల్వామాలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దీంతో ఓ ఇంట్లో నక్కి ఉన్న ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు కమ్రాన్, రషీద్ ఘాజీ సైన్యంపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో సైన్యం, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో సైన్యానికి చెందిన ఒక మేజర్ తో పాటు ముగ్గురు సైనికులు కన్నుమూశారు. ఇంట్లో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. సైన్యం కాల్పుల్లో హతమైన ఉగ్రవాది రషీద్ ఘాజీనే పుల్వామా ఉగ్రదాడికి సూత్రదారిగా సైన్యం గుర్తించింది.

Tags:    

Similar News