బ్రేకింగ్ : ముఖ్యమంత్రి ఇకలేరు….!!

గోవా ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత మనోహర్ పారికర్ మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా పాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ [more]

Update: 2019-03-17 15:26 GMT

గోవా ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత మనోహర్ పారికర్ మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా పాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారేకర్ ఆరోగ్యం సహకరించకపోయినా ఇటీవల శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 63 ఏళ్ల పారికర్ మూడుసార్లు గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగిన మనోహర్ పారికర్ బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. 2014 నుంచి 2017వరకూ ఆయన రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచార బాధ్యతలను, అభ్యర్దుల ఎంపికను బీజేపీ పారికర్ కు అప్పగించింది. పారికర్ మృతితో గోవా బీజేపీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News