జ్యోతి హత్య కేసులో కీలక మలుపు.. ప్రియుడే యముడు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన మంగళగిరిలో జరిగిన జ్యోతి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. జ్యోతిని హత్య చేసింది ప్రియుడు శ్రీనివాసరావేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పెళ్లి [more]

Update: 2019-02-15 11:21 GMT

రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన మంగళగిరిలో జరిగిన జ్యోతి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. జ్యోతిని హత్య చేసింది ప్రియుడు శ్రీనివాసరావేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పెళ్లి చేసుకోమని ఒత్తి తెస్తున్న జ్యోతిని వదిలించుకునేందుకు శ్రీనివాసరావు ఆమెను హత్య చేయాలని పథకం రచించాడు. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఇద్దరు స్నేహితుల సహకారంతో హత్య చేశాడు. తప్పించుకునేందుకు గానూ తలకు చిన్న గాయం చేసుకొని డ్రామా ఆడాడు. తాను, జ్యోతి మాట్లాడుకుంటుండగా ఎవరో వచ్చి తనను కొట్టి జ్యోతిని హత్య చేశారని నమ్మబలికాడు. పోలీసులు అన్ని కోణాల నుంచి విచారణ జరిపి అసలు విషయాన్ని తేల్చారు. జ్యోతి కుటుంబసభ్యులు సైతం మొదటినుంచి ప్రియుడు శ్రీనివాసరావుపైనే అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

Tags:    

Similar News