వైసీపీ ప్రభుత్వంపై ఉద్యమిస్తామన్న బీజేపీ నేత

వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అభిప్రాయపడ్డారు. విశాఖలో ఆస్తులను అమ్మడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం దివాలా తీసిందని [more]

Update: 2021-06-12 07:33 GMT

వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అభిప్రాయపడ్డారు. విశాఖలో ఆస్తులను అమ్మడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం దివాలా తీసిందని మాధవ్ ఎద్దేవా చేశారు. బిల్డ్ ఏపీ పేరుతో గతంలో భూములను అమ్మేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిం చేసిందని, అయితే న్యాయస్థానాలు అడ్డుకోవడంతో కొంత న్యాయం జరిగిందని మాధవ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారన్నారు. వైజాగ్ నాట్ ఫర్ సేల్ అనే నినాదంతో తాము ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. చివరకు హెరిటేజ్ స్ట్రక్చర్ గా ఉన్న కలెక్టర్ కార్యాలయాన్ని కూడా అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు.

Tags:    

Similar News