కర్నూలులో లోకాయుక్త ఆఫీసు ఏర్పాటు

కర్నూలులో లోకాయుక్త కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కర్నూలులో స్టేట్ గెస్ట్ హౌస్ లో తాత్కాలికంగా లోకాయుక్త కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి కర్నూలుకు వచ్చి [more]

Update: 2021-08-28 06:44 GMT

కర్నూలులో లోకాయుక్త కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కర్నూలులో స్టేట్ గెస్ట్ హౌస్ లో తాత్కాలికంగా లోకాయుక్త కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి కర్నూలుకు వచ్చి కార్యాలయాన్ని పరిశీలించారు. కర్నూలును న్యాయరాజధానిగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత లోకాయుక్త కార్యాలయాన్ని ప్రభుత్వం కర్నూలుకు తరలించింది. దీంతో పాటు మానవహక్కుల కమిషన్ ఏపీ కార్యాలయాన్ని కూడా కర్నూలుకు తరలించింది. లోకాయుక్త కార్యాలయం ఏర్పాటు పట్ల కర్నూలు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News