సర్వేలపై క్లారిటీ ఇచ్చిన లగడపాటి

Update: 2018-07-30 07:05 GMT

ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, కానీ ఎన్నికల సర్వేలు మాత్రం కొనసాగిస్తానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే సరేవ వివరాలు విడుదల చేస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర ప్రజల బలమైన ఆకాంక్ష అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలతో ప్రత్యేక హోదా రాదని, పోరాటాల ద్వారానే వస్తుందన్నారు.

Similar News