ఎన్నికల్లో పోటీ చేయనున్న ఎల్.రమణ

తెలంగాణలో మరోసారి టీడీపీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ పోటీచేయనున్నారు. ఈ [more]

Update: 2021-02-07 02:48 GMT

తెలంగాణలో మరోసారి టీడీపీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ పోటీచేయనున్నారు. ఈ మేరకు పార్టీ నిర్ణయం తీసుకోనుంది. త్వరలోనే తెలంగాణలో పట్బభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ తో పాటు వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్బభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ పదవికి ఎన్నిక జరగనుంది. ఎల్. రమణ పోటీ చేస్తుండటంతో మరోసారి తెలంగాణలో టీడీపీ తన బలం ఏంటో నిరూపించుకోవాలనుకుంటుంది.

Tags:    

Similar News