బాబు డ్రామాలను నమ్మేంత పిచ్చోళ్లు కాదు

ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వారని, ఎన్నికల మూడు నెలల ముందు డ్రామాలు చేస్తే ప్రజలు నమ్మరనే విషయాన్ని చంద్రబాబు నాయుడు మర్చిపోతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ [more]

Update: 2019-01-23 12:46 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వారని, ఎన్నికల మూడు నెలల ముందు డ్రామాలు చేస్తే ప్రజలు నమ్మరనే విషయాన్ని చంద్రబాబు నాయుడు మర్చిపోతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ… చంద్రబాబుకు దిగిపోయే టైం దగ్గర పడ్డందున ఆపద మొక్కులు మొక్కుతున్నారన్నారు. సంక్షేమ పథకాల వల్ల కేసీఆర్ గెలిచారని, అక్కడ కూడా తెలంగాణ పథకాలనే కాపీ పేస్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు. నాలుగేళ్ల కింద తాము ట్రాక్టర్లు, ఆటోలపై పన్ను రద్దు చేస్తే ఇప్పుడు కాపీ కొట్టిన చంద్రబాబు ఏపీలో రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. చిత్తశుద్ధి లేని శివపూజలు చేస్తే, ఎన్నికల ముందు డ్రామాలు చేస్తే తెలుసుకోలేని వారు ఏపీ ప్రజలు కాదని, రాజకీయంగా ఏపీ చైతన్యం ఉన్న ప్రాంతమన్నారు. అక్కడి ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం తనకు ఉందన్నారు.

Tags:    

Similar News