ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : కేటీఆర్

పార్లమెంటు వేదికగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన వైసీపీ అధినేత [more]

Update: 2019-01-16 09:26 GMT

పార్లమెంటు వేదికగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ… ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు లోక్ సభ, రాజ్యసభలో తమ ఎంపీలు ఇప్పటికే స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు.

గుణాత్మక మార్పు కోసమే….

దేశంలో గుణాత్మక మార్పు రావాలని, సమాఖ్య స్ఫూర్తితో ఒక వేదిక ఉండాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాన్ని వివరించేందుకు ఇవాళ జగన్ ను కలిసినట్లు తెలిపారు. రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా కేంద్ర ప్రభుత్వం ఉండేలా ఫెడరల్ ఫ్రంట్ ఉంటుందన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసి తదుపరి చర్చలు జరుపుతామన్నారు.

Tags:    

Similar News