బ్రేకింగ్ : ఢిల్లీలో కొండా దంపతులు

Update: 2018-09-25 14:20 GMT

కేసీఆర్ పై, టీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసిన కొండా సురేఖ, కొండా మురళి ఢిల్లీకి వెళ్లారు. టీఆర్ఎస్ లో ఆమె టిక్కెట్ పెండింగ్ లో పెట్టడంపై అసంతృప్తితో వారు టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ కేసీఆర్ కు 10 పేజీల బహిరంగ లేఖ రాసి విమర్శనాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ కు దూరమైన కొండా దంపతులు కాంగ్రెస్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు ప్రెస్ మీట్ తర్వాత ఢిల్లీకి చేరారు. రేపు వారు కాంగ్రెస్ ముఖ్యనేత గులాం నబీ ఆజాద్ ను, సోనియా గాంధీని కలిసే అవకాశం ఉంది. గతంలో కాంగ్రెస్ లో పనిచేయడం, ముఖ్యనేతలతో మంచి పరిచయాలు ఉండటంతో వారు ఢిల్లీలోనే కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది.

Similar News