రాహుల్ తో కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం చెప్పారు..?

Update: 2018-09-14 08:18 GMT

తెలంగాణ కాంగ్రెస్ లో రెబల్స్ గా ముద్రపడి కోమటిరెడ్డి బ్రదర్స్ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శుక్రవారం ఢిల్లీలో తెలంగాణ నేతలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఇందులో భాగంగా కోమటిరెడ్డి బ్రదర్స్ తో రాహుల్ 15 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే, తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో పెదవివిరిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పొత్తులకు తాము వ్యతిరేకంగా కాదని.. కానీ కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాలను ఇతర పార్టీలకు వదలడం సరికాదనేది తమ ఉద్దేశ్యమని వారు స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చినా ఓటమి చెందామని... తెలంగాణ కోసం పోరాడిన కాంగ్రెస్ నేతలను ఈ ఎన్నికల్లో ముందుంచాలని సూచించారు. మొదటినుంచీ కాంగ్రెస్ లో ఉన్న నేతలకు, యువకులకు టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని వారు రాహుల్ ను కోరారు.

Similar News