పాలన లేదు.. అన్నీ కక్ష సాధింపు చర్యలే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకే కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారన్నారు. భూ ఆక్రమణలపై [more]

Update: 2021-05-09 00:49 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకే కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారన్నారు. భూ ఆక్రమణలపై రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర విచారణ జరపాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. తాము కూడా భూ ఆక్రమణలపై వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. కరోనా కట్టడిలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. రెమిడెసివర్ ఇంజక్షన్ ముప్ఫయివేలకు విక్రయిస్తున్నారని కోదండరామ్ ఆరోపించారు. సరూర్ నగర్ స్టేడియంను కోవిడ్ ఆసుపత్రిగా చేయాలని కోదండరామ్ కోరారు.

Tags:    

Similar News