సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ప్రేమాయణం..!

ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి హత్య చేసిన సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి గురించి ఆశర్చర్యకర కోణాలు బయటకు వస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం [more]

Update: 2019-05-03 08:15 GMT

ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి హత్య చేసిన సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి గురించి ఆశర్చర్యకర కోణాలు బయటకు వస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హజీపూర్ గ్రామంలో ముగ్గురు బాలికలను అతికిరాతకంగా చంపి బావుల్లో పాతిపెట్టిన శ్రీనివాస్ రెడ్డికి ప్రేమాయణం కూడా ఉందట. వేములవాడకు చెందిన ఓ యువతి, శ్రీనివాస్ రెడ్డి ప్రేమించుకుంటున్నారని పోలీసుల విచారణలో తేలింది. గతంలో వేములవాడకు వెళ్లినప్పుడు సదరు యువతి శ్రీనివాస్ రెడ్డికి పరిచయం అయ్యింది. శ్రీనివాస్ రెడ్డి ఎంత కర్కశుడో తెలియని ఆ యువతి సైతం శ్రీనివాస్ రెడ్డిని ప్రేమించింది. తామిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించాడు.

Tags:    

Similar News