పార్లమెంటులో ఏపీ ఇంగ్లీష్ మీడియం

పార్లమెంటులో ఇంగ్లీష్ మీడియం వివాదాన్ని తెలుగుదేశం పార్టీ లేవనెత్తింది. తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పార్లమెంటు సమావేశాల్లో ఏపీలో ఇంగ్లీష్ మీడియం అంశాన్ని లేవనెత్తారు. ఏపీలో [more]

Update: 2019-11-18 06:38 GMT

పార్లమెంటులో ఇంగ్లీష్ మీడియం వివాదాన్ని తెలుగుదేశం పార్టీ లేవనెత్తింది. తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పార్లమెంటు సమావేశాల్లో ఏపీలో ఇంగ్లీష్ మీడియం అంశాన్ని లేవనెత్తారు. ఏపీలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టినందువల్ల తెలుగు భాష మనుగడ ప్రశ్నార్థకమవుతుందని కేశినేని నాని ఆరోపించారు. వెంటనే దీనిపై రాష్ట్రాన్ని ఆదేశించాలని కోరారు. ఇదే సమయంలో వైసీపీ పార్లమెంటు సభ్యుడు రాఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ తెలుగు అకాడమీకి నిధులు కేటాయించాలని కోరారు. తెలుగుకు వచ్చిన ముప్పేమీ లేదని ఆయన చెప్పారు.

Tags:    

Similar News