కుట్ర కేసీఆర్ దే అయితే.. నిన్నెందుకు సీఎంని చేస్తారు..?

వైశ్రాయ్ హోటల్ కుట్రకు సిద్ధాంతకర్త కేసీఆర్ అయితే ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవారని, చంద్రబాబును ఎందుకు చేస్తారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో [more]

Update: 2018-12-31 11:11 GMT

వైశ్రాయ్ హోటల్ కుట్రకు సిద్ధాంతకర్త కేసీఆర్ అయితే ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవారని, చంద్రబాబును ఎందుకు చేస్తారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబులా పూటకో మాట మార్చుకునే పార్టీ టీఆర్ఎస్ కాదని పేర్కొన్నారు. చంద్రబాబుతో పొత్తు కోసం తాము వెంటపడలేదని, చంద్రబాబు తమతో పొత్తు కోసం కేసీఆర్ ని బతిమిలాడారన్నారు. చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించడంలో కేసీఆర్ విజయం సాధించారన్నారు. మొన్నటి ఎన్నికల్లో మోదీ-కేసీఆర్ ఒక్కటేని చంద్రబాబు చెబితే ప్రజలు తప్పని నిరూపించారని అన్నారు. ఇప్పుడు ఏపీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, కానీ ఏపీ ప్రజలు ఈసారి చంద్రబాబు మాటలు నమ్మరని పేర్కొన్నారు. ప్రజలు అమాయకులు, వారికేమీ గుర్తుండదు అనే ఆలోచనలో చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. నాలుగున్నరేళ్లలో హైకోర్టు కట్టలేని చంద్రబాబు చేతకానితనాన్ని ఏపీ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

Tags:    

Similar News