రాజీనామాకు రెడీ…?

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఈరోజు రాత్రి ఏడు గంటలకు గవర్నర్ వాజూబాయి వాలాను కలవనున్నారు. ఆయన ఈరోజు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెబల్ [more]

Update: 2019-07-22 11:53 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఈరోజు రాత్రి ఏడు గంటలకు గవర్నర్ వాజూబాయి వాలాను కలవనున్నారు. ఆయన ఈరోజు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలు ఎంతకీ దిగిరాకపోవడంతో బలపరీక్షలో ఓటమి తప్పదని కుమారస్వామి భావిస్తున్నారు. బలపరీక్షకు ముందే రాజీనామా చేసే యోచనలో కుమారస్వామి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కుమారస్వామి గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. ముందుగా రాజీనామా చేయడం ద్వారా ఓటమి చెందానని భాధ నుంచి బయటపడటమే కాకుండా సానుభూతిని కూడా దక్కించుకునే అవకాశముంది. మరోవైపు స్పీకర్ రమేష్ కుమార్ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసుకోవచ్చని సూచించడం గమనార్హం.

Tags:    

Similar News