ఆయన పదవీ కాలాన్ని పొడిగించొద్దు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ పదవీ కాలాన్ని పొడిగించవద్దని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన డీవోపీటీకి లేఖ [more]

Update: 2021-06-18 08:23 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ పదవీ కాలాన్ని పొడిగించవద్దని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన డీవోపీటీకి లేఖ రాశారు. ఆదిత్యానాధ్ దాస్ జగన్ కేసుల్లో సహ నిందితుడిగా ఉన్నారని కనకమేడల తన లేఖలో పేర్కొన్నారు. ఇండియా సిమెంట్స్ కు ప్రయోజనం చేకూర్చారని సీబీఐ కేసు నమోదు చేసిందని కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. ఈ నెల 20వ తేదీతో ఆదిత్యానాధ్ దాస్ పదవీ కాలం ముగియనుంది. ఆయన పదవీకాలం పొడిగిస్తే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమేనని కనకమేడల రవీంద్ర కుమార్ లేఖలో డీవోపీటీకి తెలిపారు.

Tags:    

Similar News